- బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి
యాదాద్రి, వెలుగు: పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రధానమంత్రి క్రీడా మహోత్సవం కన్వీనర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి క్రీడా మహోత్సవం 2025-26 పోటీలపై నిర్వహించిన సన్నాహక మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ భువనగిరి నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు నగదు బహుమతి అందిస్తామని చెప్పారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 5 వరకూ భువనగిరిలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ పోటీల్లో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. ఈ మీటింగ్ లో పడమటి జగన్మోహన్ రెడ్డి, లింగస్వామి, కపిల్, ఉషాకిరణ్ ఉన్నారు.
