బీజేపీతోనే ఆరోగ్య తెలంగాణ : నారాయణ రెడ్డి

బీజేపీతోనే ఆరోగ్య తెలంగాణ : నారాయణ రెడ్డి

యాదాద్రి, వెలుగు :  బీజేపీతోనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం వాకర్స్​ను కలిసి ఓటు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ పవర్​లోకి వచ్చిన తర్వాతే ఆయుష్మాన్​ భారత్​ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

కానీ ఈ పథకాన్ని రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పట్టించుకోలేదని మండిపడ్డారు.  ఆరోగ్యశ్రీని  కూడా గాలికొదిలేశారని విమర్శించారు. ఆయుష్మాన్​ భారత్​, ఆరోగ్యశ్రీని సరిగా అమలు చేయని సర్కారు.. లిక్కర్​ మాత్రం విచ్చల విడిగా అమ్ముతోందని ఆరోపించారు.  లిక్కర్‌‌‌‌‌‌‌‌పై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.