అహ్మదాబాద్: లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసుల వల్ల ఒత్తిడికి గురైన ఓ 12 ఏళ్ల బాలిక ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన గుజరాత్లోని రాజ్కోట్లో జరిగింది. రిపోర్ట్ ప్రకారం.. ఖుషి (12) తన పేరెంట్స్, తమ్ముడితో కలసి రాజ్కోట్లో ఉంటోంది. రీసెంట్గా ఖుషిని ఆమె పేరెంట్స్ గుజరాతీ మీడియం స్కూల్లో జాయిన్ చేశారు. లాక్డౌన్ కారణంగా స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు చెబుతుండటంతో ఖుషికి ఆమె తండ్రి రోహిత్ షింగాడియా రూ.10 వేల ఖరీదైన స్మార్ట్ఫోన్ కొనిచ్చాడు. దీంతో ఖుషి ఫోన్లోనే క్లాసులకు హాజరవుతూ, హోం వర్క్ పూర్తి చేస్తోంది. ఎప్పటిలాగే సోమవారం కూడా హోం వర్క్ పూర్తి చేయాలని ఖుషిని తల్లి ఆదేశించింది. దీంతో ఖుషి రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత తల్లి వెళ్లి చూడగా ఖుషి సీలింగ్కు ఉరి వేసుకొని కనిపించింది. ఆన్లైన్ క్లాసుల వల్ల ఒత్తిడికి గురవడం, హోం వర్క్ చేయాల్సి రావడం, మానసిక ఒత్తిడితోపాటు తన క్లాస్మేట్స్ను కలుసుకోలేకపోతున్నాననే బాధతోనే ఖుషి ఆత్మహత్య చేసుకుందని సమాచారం. కాగా, సదరు బాలిక తండ్రి రోహిత్ తమ ఇంటికి సమీపంలోనే ఆటో గ్యారేజ్ నడుపుతున్నాడని తెలిసింది. కరెంటు బిల్లులు కట్టలేని దుస్థితిలో కూడా కూతురి చదువు కోసం స్మార్ట్ఫోన్ కొనిచ్చాడని సమాచారం.
ఆన్లైన్ క్లాసుల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న 12 ఏళ్ల బాలిక
- క్రైమ్
- June 24, 2020
లేటెస్ట్
- బాలల హక్కులు, చట్టాలపై అవగాహన పెరగాలి
- రాహుల్ ప్రధాని అయితరు : సీతక్క
- ఆడి క్యూ3 బోల్డ్ @ రూ. 54.65 లక్షలు
- చింతమడకలో ఓటేసిన కేసీఆర్
- చివరి గంట కొనుగోళ్లతో లాభాలు
- జొమాటో లాభం రూ.175 కోట్లు
- పోలింగ్ ప్రశాంతం..ఖమ్మం పార్లమెంట్లో 75.19 శాతం
- మెజారిటీ సీట్లలో కాంగ్రెస్దే గెలుపు.. పెద్దపల్లిలో వంశీకృష్ణ విజయం ఖాయం: వివేక్ వెంకటస్వామి
- రిలీజ్ అయిన 11 నెలల తర్వాత ఓటీటీలోకి జర హట్కే జర బచ్కే చిత్రం
- ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..కరీంనగర్లో 5 గంటల వరకు 67 శాతం దాటిన ఓటింగ్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు