మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం .. రౌడీ షీటర్ పై గ్యాంగ్ వార్

మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం ..  రౌడీ షీటర్ పై గ్యాంగ్ వార్

కరీంనగర్ జిల్లాలోని  మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి.  ఓ క్రిమినల్ పై దాడి చేసేందుకు మరో క్రిమినల్ మూఠా రంగంలోకి దిగింది.  విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగేసరికి నిందితుల్లో కొందరు పరారయ్యారు. ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.  

ఇక  వివరాల్లోకి వెళ్తే..  రౌడీ షీటర్ అరుణ్ అనే అతనిపై హత్య చేసేందుకు గుర్తుతెలియని ఆరుగురు దుండగులు యత్ని్ంచారు. అతనిని గన్ తో కాల్చే ప్రయత్నం చేయగా అరుణ్ వారినుంచి తప్పించుకున్నాడు.  అయినప్పటికీ అతన్ని నిందుతులు వదిలిపెట్టలేదు.  అరుణ్ తలదాచుకున్న ఇంట్లోకి వెళ్లి గొడవకు ఎలాంటి సంబంధం లేని వారి ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారు

అరుణ్ పై దాడి చేసిన వారిలో ఇద్దరిని పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అతన్ని చంపేందుకు వచ్చిన దుండగల్లో ఒకరు తుపాకీతో బెదిరించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.  ఈ ఘటనలో ఆరుణ్ కూతురు వైష్ణవికి గాయాలు అయ్యాయి.  గతంలో ఆరుణ్ పై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటు నమోదు అయింది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మానకొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు.