- ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వద్దని గురుకుల కాలేజీ స్టూడెంట్ల ఆందోళన
- జగిత్యాల జిల్లా మెట్పల్లిలో హైవేపై ధర్నా
కోరుట్ల,వెలుగు: జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం స్టూడెంట్స్ నిరసనకు దిగారు. నేషనల్హైవే పై స్టూడెంట్స్ బైఠాయించి, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మాధురికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. అకారణంగా తమపై ప్రిన్సిపాల్ చేయి చేసుకుంటున్నారని, తిండి పెట్టడం కూడా దండగ అంటూ తిడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు.
వెంటనే ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ప్రిన్సిపాల్ ను నియమించాలని స్టూడెంట్స్, పేరెంట్స్కోరారు. ధర్నాతో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. తహసీల్దార్ నీత, జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్ వెళ్లి విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
