ఈ మధ్య హ్యాకర్స్, ఫైనాన్షియల్ స్కామ్స్టర్స్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కాజేస్తున్నారు. వీళ్లు ఆ ఇన్ఫర్మేషన్ని డార్క్వెబ్లో అమ్మి, డబ్బులు సంపాదిస్తున్నారు. డార్క్వెబ్లో 2021లో 9 కోట్ల 60 లక్షలకు పైగా క్రెడిట్ కార్డుల్ని అమ్మారని ఫ్లోరిడాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘జెమిని అడ్వైజరీ’ చెప్పింది. దొంగిలించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డిటెయిల్స్ని డార్క్ వెబ్లో ‘కార్డింగ్ ఫోరమ్స్’కి అమ్ముతారు హ్యాకర్లు. అంతేకాదు వెబ్సైట్లని ఎలా హ్యాక్ చేయాలి? దొంగిలించిన డేటా సాయంతో బ్యాంక్ అకౌంట్లని ఎలా హ్యాక్ చేయాలి? అనేది కూడా చెప్తారు.
డాలర్లలో రేటు
‘కార్డింగ్ ఫోరమ్స్’ ఒక క్రెడిట్ కార్డ్ రికార్డుకి 14 నుంచి 30 డాలర్లు ఇస్తాయని ప్రైవసీ అఫైర్స్.కామ్ చెప్తోంది. ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్స్ రికార్డ్కి 40 డాలర్లు, ఫేస్బుక్ అకౌంట్లని హ్యాక్ చేస్తే, 35 డాలర్లు ఇస్తారట.
ట్వీట్స్ ఫాలోవర్స్కి మాత్రమే
ట్విట్టర్లో చాలామంది ఓపెన్గా ఏ విషయం మీదైనా తమ ఒపీనియన్ చెప్తారు. వాళ్ల ట్వీట్లు అందరికీ కనిపించడం వల్ల కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడతారు. అయితే, ఇప్పట్నుంచి యూజర్లు తమ ట్వీట్స్ని ఫాలోవర్స్ మాత్రమే చూసేలా చేయొచ్చు. అందుకు ట్విట్టర్ కొత్త ఫీచర్ తీసు కొచ్చింది. అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్లి ప్రైవసీ, సేఫ్టీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆడియెన్స్, ట్యాగింగ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే, ‘ప్రొటెక్ట్ యువర్ ట్వీట్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే ఇకపై ఫాలోవర్స్ మాత్రమే ట్వీట్స్ చూడగలుగుతారు. దీని కిందనే ఫొటో ట్యాగింగ్ ఆప్షన్ ఉంటుంది. దీనిలో ‘ఎవరైనా ట్యాగ్ చేయొచ్చు’, ‘ఫాలో అయ్యేవాళ్లు మాత్రమే ట్యాగ్ చేయొచ్చు’ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో రెండోది సెలక్ట్ చేసుకుంటే ఎవరు పడితే వాళ్లు మీ ఫొటోల్ని ట్యాగ్ చేయడం కుదరదు.