లాహోర్: లష్కరే తాయిబా టెర్రరిస్ట్ హఫీజ్ అబ్దుల్ సలామ్భుట్టావీ బుధ వారం పాక్ జైల్లో గుండెపోటుతో చని పోయాడు. హఫీజ్ రెండు సందర్భాల్లో లష్కరే తాయిబాకు చీఫ్గా వ్యవహరిం చాడు. 26 సెప్టెంబర్ 2008న ముంబైలో దాడిచేసిన ఉగ్రవాదులకు భుట్టావీ ట్రైనింగ్ ఇచ్చాడు.
జమాతుద్ దవా చీఫ్, ముంబై అటాక్ మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యద్కు సహాయకుడిగా వ్యవహరిం చాడు. ఈ నేపథ్యంలో భుట్టావీని అంతర్జాతీయ టెర్రరిస్టుగా యూఎన్ ప్రకటించింది. కాగా, టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో పాకిస్తాన్లోని షేకుపురా జిల్లా జైలులో భుట్టావీ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నెల 29 న గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు తెలిపారు.
