ఫుడ్​ పెట్టకుండా.. చీకటి గదిలో చిత్రహింసలు

ఫుడ్​ పెట్టకుండా.. చీకటి గదిలో చిత్రహింసలు

రిషాన్ లెజియోన్(ఇజ్రాయెల్) :  ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పౌరు లను, చిన్నారులను బందీలుగా చేసుకున్న హమాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ తర్వాత వారిపట్ల కఠినంగా వ్యవహరించింది. వారికి సరైన ఫుడ్ ​పెట్టకుండా చీకటి గదిలో వేసి చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. తాజాగా హమాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెర నుంచి విడుదలైన ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పౌరుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన వారి ఆరోగ్యం బాగా క్షీణిచిందని.. సరైన ఫుడ్ ​లేకపోవడంతో వారు బరువు తగ్గారని డాక్టర్లు తెలిపారు.  విడుదలైన వారి ఆరోగ్య పరిస్థితిని వెల్లడించకూడదంటూ అధికారులు తమను ఆదేశించినట్లు తెలిపారు. 

ఈ ఆరోగ్య నివేదికలు హమాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరలో ఉన్న మరికొందరు బందీలకు ప్రాణ సంకటంగా మారకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారాన్ని రాతపూర్వకంగా బయటకు చేరవేస్తామనే ఉద్దేశంతో మేం పెన్సిల్​ అడిగినా హమాస్ మిలిటెంట్లు ఇచ్చే వారు కాదు. రోజుకు కొంచెమే ఫుడ్​పెట్టేవారని.. అందులో పండ్లు, కూరగాయలు, గుడ్లు ఉండేవి కావని ఓ బాధితురాలు తెలిపింది. 

హమాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి విడుదలైన12 ఏండ్ల బాలుడు తన భయానక అనుభవాన్ని తన బామ్మతో పంచుకోగా ఆమె మీడియాకు చెప్పింది. 16 రోజుల పాటు ఓ చీకటిగదిలో బాలుడిని ఉంచారని.. బాంబుల శబ్దానికి అతను ఎంతో భయపడ్డాడని ఆమె తెలిపింది. కాగా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 50కి పైగా బందీలు విడతల వారీగా బయటకు వచ్చారు.