పీడీఎస్  బియ్యం పట్టివేత.. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఘటన

పీడీఎస్  బియ్యం పట్టివేత.. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఘటన

శాయంపేట, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యాన్ని  గురువారం పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్​ మండలం కామారం గ్రామానికి చెందిన తక్కళ్లపెల్లి చిరంజీవి  ఒక ట్రక్కులో  శాయంపేట మండలం మైలారం గ్రామశివారు నుంచి  28 క్వింటాళ్ల బియ్యాన్ని తరిస్తుండగా పెట్రోలింగ్​ చేస్తున్న ఎస్సై పరమేశ్వర్​ పట్టుకున్నారు. వాహనంతో పాటు అతనిపై కేసునమోదు చేసి అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.