
న్యూఢిల్లీ : ఆసియా కప్, వన్డే వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్కు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘ప్రస్తుతానికి ఏదీ ఖరారు కాలేదు. వెస్టిండీస్లో టీ20, వన్డేలు ముగిసిన తర్వాత పాండ్యా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఐర్లాండ్ వెళ్లడానికి ట్రావెలింగ్ కూడా ఎక్కువగా చేయాల్సిన పని లేదు.
ఫ్లోరిడా నుంచి డబ్లిన్ వరకు ఒకసారే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మ్యాచ్ల మధ్య విరామం కూడా తక్కువే. వరల్డ్ కప్లో పాండ్యా వైస్ కెప్టెన్గా కూడా పని చేయాల్సి రావొచ్చు. అందుకే వర్క్లోడ్ను పరిగణనలోకి తీసుకోవాలి. గిల్ విషయంలోనూ ఇదే ఆలోచనలు ఉన్నాయి’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.