IPL 2024: నాకు బ్రేక్ కావాలి: ముంబై జట్టును వదిలి ఇంటికి వెళ్లిపోయిన పాండ్య

IPL 2024: నాకు బ్రేక్ కావాలి: ముంబై జట్టును వదిలి ఇంటికి వెళ్లిపోయిన పాండ్య

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు కెప్టెన్సీలో, మరోవైపు ప్లేయర్ గా   విఫలమవుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. దీనికి తోడు వ్యక్తిగతంగా ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఆటిట్యూడ్ ఎవరికీ నచ్చడం లేదు. ఎన్నో అంచానాలు మధ్య ముంబై జట్టులోకి రాయల్ గా అడుగుపెట్టిన పాండ్యకు అప్పుడే కష్టకాలం ఎదురైంది. ఇప్పటివరకు ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దీంతో హార్దిక్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు.

సన్ రైజర్స్ తో ఓటమి తర్వాత ముంబై జట్టు సొంత గడ్డపై అడుగుపెట్టింది. నివేదికల ప్రకారం.. హార్దిక్ విమానాశ్రయంలో దిగిన వెంటనే  ముంబైలోని తన ఇంటికి వెళ్ళాడు.  తర్వాత మ్యాచ్ కు నాలుగు రోజుల విరామం రావడంతో ఈ సెలవులను జట్టుతో కాకుండా తన కుటుంబంతో గడపాలని నిర్ణయం తీసుకున్నాడు. హార్దిక్ కారులో తన ఇంటికి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో 6 పరుగుల తేడాతో ఓడిపోయిన ముంబై.. ఆ తర్వాత మ్యాచ్ లో సన్ రైజర్స్ పై 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్స్ తో తలబడుతుంది. సొంతగడ్డపై వాంఖడేలో ఈ మ్యాచ్ జరగనుంది. మరి పాండ్య బ్రేక్ ముంబైను విజయాల బాట పట్టిస్తుందో లేదో చూడాలి.