నీళ్ల వాటాపై సీఎం రేవంత్ చెప్పేవి అబద్దాలు : హరీశ్ రావు

నీళ్ల వాటాపై సీఎం రేవంత్ చెప్పేవి అబద్దాలు : హరీశ్ రావు

సీఎం రేవంత్ కు బేసిక్స్ తెలియవ్.. బేసిన్సి తెలియవని సెటైర్ వేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. దేవాదుల ఏ బేసిన్ లో ఉందో రేవంత్ కు తెల్వదన్నారు.   ముఖ్యమంత్రి అశ్రద్ధ నిన్న బయటపడిందని విమర్శించారు.  బనకచర్లపై రేవంత్ అసత్యాలు చెప్పారన్నారు.  ఆంధ్రా దోపిడి అడ్డుకోమంటే తమపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ తరపున బనకచర్ల ప్రాజెక్ట్ ఆపడానికి సహకరిస్తామని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే తామ మద్దతిస్తామన్నారు. బనకచర్లపై సర్కార్ ను నిద్ర లేపింది బీఆర్ఎస్..తాను ప్రశ్నిస్తేనే సీఎం ఢిల్లీకి లేఖలు రాశారని చెప్పారు హరీశ్ .

Also Read : కేసీఆర్ పదేండ్లు బొమ్మ ఇండ్లు చూపించి ఓట్లు వేయించుకుండు

గోదావరిలో 968 టీఎంసీలు కాదు. కేసీఆర్ 1900 టీఎంసీలు అడిగారు. రేవంత్ 1000 టీఎంసీలు చాలంటున్నారు.  వెయ్యి టీఎంసీలు ఇచ్చి బనకచర్ల కట్టుకోవచ్చని రేవంత్ అంటున్నారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడడం ఏంటి.? చంద్రబాబు మనకు నీళ్లు ఇచ్చేదేంటి.? తెలంగాణకు  గోదావరిలో 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. మరో 20 టీఎంసీలు సూత్రప్రాయంగా ఆమోదించింది. నిన్న రేవంత్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. రేవంత్ కు  బ్యాగుల మీద ఉన్న శ్రద్ధ బేసిన్ లపై లేదు.   బూతులు మాట్లాడినంత ఈజీ కాదు..బేసిన్ ల గురించి తెలుసుకోవడం. కేసీఆర్ జీవితం అంతా నీటి కోసం పోరాడారు అని హరీశ్ అన్నారు.