
కేసీఆర్ వాసాలమర్రి ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మ ఇండ్లు చూపించుకుని ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. జూన్ 19న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో 205 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఒక్క వారంలోనే వాసాలమర్రిని బాగు చేస్తున్నామని చెప్పారు. ఆగం చేసిన వాసాలమర్రిని అభివృ ద్ధి చేసి, చూపిస్తామన్నారు
పేదోడి సొంతింటి కల సాకారం చేస్తున్నం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించుకుని ఓట్లు వేయించుకున్నాడు తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. మేం మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వమంటేనే పేదోడి ప్రభుత్వం. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. భూభారతి చట్టంతో భూములను కాపాడుతాం. ఆగస్టు లోపు భూసమస్యలు మొత్తం పరిష్కరిస్త తప్పును ఒప్పుగా.. ఒప్పును తప్పుగా చేసి పదేండ్లు రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్.. మళ్లీ ప్రజలకు నమ్మించి మోసం చేయడానికి కుట్ర చేస్తుండని పొంగులేటి అన్నారు.
►ALSO READ | అన్యాయం జరిగితే సుప్రీంకు వెళ్తాం.. బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్
కేసీఆర్ వాసాలమర్రిలో ఇక్కడి అవ్వతో అన్నం తిని దేశానికి రోల్ మోడల్ చేస్తామని మాట ఇచ్చి.. మిమ్మల్ని ఆగం చేసిండు. వాళ్లు ఆగం చేసి పోతే... మేం ఇందిరమ్మ ఇండ్ల మొదటి ప్రొసిడింగ్ ను అప్పట్లో కేసీఆర్ తో భోజనం చేసి హాస్పి టల్ పాలైన ఆగవ్వకు ఇస్తున్నం. కేసీఆర్ దత్తత తీసుకుంటే.. జీవితాలు మారుతాయని అనుకుండ్రు... మాయమాటలు చెప్పి నట్టేట ముంచిండు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.