రంగారెడ్డి, వెలుగు: డ్రా పద్ధతి లో మద్యం షాపులు కేటాయిస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023-–2025 సంవత్సరంలో సరూర్ నగర్ ఎక్సైజ్ యూనిట్లో ఎస్సీలకు 11, ఎస్టీలకు 2, బీసీలకు 25, జనరల్ కు 96 మొత్తం 134 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా10,994 దరఖాస్తులు వచ్చాయి.
శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్లో ఎస్సీలకు 6, బీసీలకు 9, జనరల్కు 85 మొత్తం100 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 10,621 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సోమవారం ఉదయం10 గంటలకు శంషాబాద్ లోని మల్లికా కన్వెన్షన్ హాల్లో డ్రా పద్ధతి ద్వారా మద్యం షాపులు కేటాయిస్తామని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు.