మాకు మరిన్ని టెస్టులు కావాలె : హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌర్‌

మాకు మరిన్ని టెస్టులు కావాలె : హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌర్‌

న్యూఢిల్లీ:  అమ్మాయిలకు మరిన్ని టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేయాలని,  డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రీస్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.  2022–25  విమెన్స్ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ) సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా రెండే టెస్టులు (ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియా) సొంతగడ్డపై ఆడనుంది. ‘ఒక ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కచ్చితంగా నాకు మరిన్ని టెస్టులు కావాలి. 

ఎందుకంటే మేము టీ20ల కంటే ఎక్కువ టెస్టులు చూస్తూ పెరిగాం. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాకు మరిన్ని  టెస్ట్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  కేటాయిస్తారని  ఆశిస్తున్నా. డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గతంలో మేం రెండు, మూడు రోజుల గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడేవాళ్లం.. వాటిని తిరిగి నిర్వహిస్తారని ఆశిస్తున్నా. ఎన్ని ఎక్కువ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడితే విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంత మెరుగవుతుంది’అని హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చింది.