- ఈ నెల 22 న నియామకం
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ ఈ నెల 22 న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 34 మంది సభ్యులున్న డబ్ల్యూహెచ్వో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు జపాన్ కు చెందిన హిరోకి నకతాని చైర్మన్ గా ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తవడంతో హర్షవర్ధన్ నియమితులు కానున్నారు. ఈ పదవికి ఇండియాను నామినేట్ చేయాలని ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య కిందటేడాది ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు194 దేశాల సభ్యత్వం కలిగిన డబ్ల్యూహెచ్వో ..ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ పదవికి ఇండియా నామినీని నియమించే ప్రతిపాదనపై మంగళవారం సంతకం చేసింది. మే 22 న జరిగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో హర్షవర్ధన్ ఎన్నికవుతారని అధికారులు తెలిపారు.