హర్యానాలో కురుమ సంఘంభవనానికి కృషి చేస్తా

హర్యానాలో కురుమ సంఘంభవనానికి కృషి చేస్తా
  • హర్యానా గవర్నర్‌‌‌‌‌‌‌‌ బండారు దత్తాత్రేయ 

బషీర్ బాగ్, వెలుగు : హర్యానా రాష్ట్రంలో  కురుమ సంఘం భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా స్థలాన్ని ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.  హైదరాబాద్ బేగంబజార్‌‌‌‌‌‌‌‌లోని రాష్ట్ర కురుమ సంఘం కార్యాలయంలో  సంఘం అధ్యక్షుడు

ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఆధ్వర్యంలో  నిర్వహించిన షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ 2024  సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  కురుమలు రాజకీయంగా రాణించి, చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.