నిర్భయ దోషులను ఉరితీసేది ఇతనే..

నిర్భయ దోషులను ఉరితీసేది ఇతనే..

ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ హత్యకేసు దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఈనెల 16వ తేదీ ఉదయం 5గంటలకు తీహార్ జైల్లో దోషులను ఉరి తీయబోతున్నారని తెలుస్తోంది. నిర్భయ సంఘటన జరిగి దాదాపు ఏడేళ్లు గడిచాయి. ఇప్పటికే దోషులు అన్ని న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరిగా రాష్ట్రపతి క్షమాబిక్ష కోసం ప్రయత్నించారు. రాష్ట్రపతి తిరస్కరించడంతో ఈ నెల 16వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాబోతున్నారు.

అయితే ఈ దోషులను ఉరి తీయడానికి తీహార్ జైళ్లో తలారీ అందుబాటులో లేడు. దాంతో తీహార్ జైలు అధికారులు తలారీని పంపిచాల్సిందిగా ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖకు ఉత్తరం రాశారు. దానికి స్పందించిన యూపీ జైళ్ల శాఖ మీరట్‌లో తలారీగా పనిచేస్తున్న పవన్ కుమార్‌ను తీహార్ జైలుకు పంపించింది. పవన్ కుమార్ గతంలో సీరియల్ కిల్లర్‌ సురేందర్ కోలిని ఉరి తీశాడు. నిర్భయ చావుకు కారణమైన ఈ దోషులను ఉరితీయడానికి పవన్ మీరట్ నుంచి తీహార్ జైలుకు పయనమయ్యారు.