లింగంపేట, వెలుగు: స్కూల్ టీచర్లతో కలిసి హెడ్మాస్టర్ అక్రమంగా పాఠ్య పుస్తకాలను విక్రయించిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు జడ్పీ హైస్కూల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. నల్లమడుగు జడ్పీ హైస్కూల్ కాంప్లెక్స్హెడ్మాస్టర్గా కృష్ణమోహన్15 రోజుల క్రితం బాధ్యతలు చేపట్టాడు. స్కూల్ పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలను ఈ నెల 19న గుట్టుచప్పుడు కాకుండా విక్రయించాడు. విషయం సోషల్మీడియాలో వైరలైంది.
నెల రోజులుగా కురిసిన వానలకు పుస్తకాలు తడిసి చెదలు పట్టాయని, గదిలో పాములు వస్తున్నాయని, పిల్లలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో బుక్స్ అమ్మినట్లు ఎస్ఎంసీ తీర్మానంలో పేర్కొన్నారు. తమకు తెలియకుండానే పాఠ్య పుస్తకాలను హెడ్మాస్టర్, టీచర్లు కలిసి అమ్ముకున్నారని ఎస్ఎంసీ చైర్మన్ సిద్దవ్వ, వైస్ చైర్మన్ మోతీరాం, పేరేంట్స్ ఆరోపించారు. పుస్తకాలు అమ్మగా రూ.2,800 వచ్చాయని, విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి వివరించినట్లు హెడ్మాస్టర్ చెప్పారు.
