- ఇవ్వాలని బీమా కంపెనీలకు ఐఆర్డీఏ ఆదేశం
న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్లకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్డెవెలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) గుడ్న్యూస్ చెప్పింది. ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ అన్ని హెల్త్పాలసీల్లో ఒమిక్రాన్ ట్రీట్మెంట్కు తప్పక కవరేజీ ఇవ్వాలని ఆదేశించింది. దేశంలోని జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటికీ ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. కరోనా ట్రీట్మెంట్ ఖర్చు భరించినట్టే ఒమిక్రాన్ బాధితుల ఖర్చూ భరించాలని సూచించింది. రోగి దగ్గర డబ్బు లేకున్నా, క్యాష్లెస్ ట్రీట్మెంట్సదుపాయం అందించేలా నెట్వర్క్ హాస్పిటళ్లతో మాట్లాడి ఒక మెకానిజాన్ని తీసుకురావాలని స్పష్టం చేసింది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందిస్తామని కంపెనీలతో చేసుకున్న సర్వీస్లెవెల్ అగ్రిమెంట్ల (ఎస్ఎల్ఏలు)ను గౌరవించాలని హాస్పిటళ్లకూ ఐఆర్డీఏ సూచించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మనదేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,525 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 460 కేసులు రాగా, ఢిల్లీలో 351, గుజరాత్లో 136, తమిళనాడులో 117, కేరళలో 109 కేసులు వచ్చాయి.