- రాను పోను ఛార్జీ రూ.19,999
- మేడారంలో విహంగ వీక్షణకు రూ.3,700
జయశంకర్ భూపాలపల్లి: మేడారం వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సర్వీస్ ను ఏర్పాటు చేశారు. ఈ నెల 13 (ఆదివారం)న హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి ఈ సర్వీస్ భక్తులకు అందుబాటలోకి రానుంది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ఆధ్వర్యంలో హెలికాప్టర్లను నడపనున్నారు. హన్మకొండ నుంచి మేడారం వెళ్లి రావడానికి ఒక్కరికి రూ.19,999 ఛార్జీ వసూలు చేయనున్నారు. మేడారంలో విహంగ వీక్షణం చేయడానికి రూ.3.700గా ఛార్జీ నిర్ణయించారు. ఒక్క ట్రిప్పులో ఆరుగురు ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది. టికెట్ బుకింగ్ కోసం 98805 05905, 94003 99999 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే info@helitaxii.com వెబ్సైట్ ను కూడా భక్తులు సంప్రదించవచ్చు.
మరిన్ని వార్తల కోసం: