ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి..వాడు పోలీసోడై ఉండాలి

ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి..వాడు పోలీసోడై ఉండాలి

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసన్నా జిందాబాద్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 27 బుధవారం నలుగురు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వెటర్నరీ డాక్టర్ దిశను అతి దారుణంగా అత్యాచారం చేశారు. తగలబెట్టి జీవితం లేకుండా చేశారు.
అయితే ఈ దారుణంపై పోలీసులు రీ కన్ స్ట్రక్షన్ చేసే పనిలో భాగంగా నిందితుల్ని చటాన్ పల్లి అండర్ పాస్ బిడ్జ్ కి తీసుకెళ్లారు. అదే సమయంలో నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎన్ కౌంటర్ చేశారు. ఆ ఎన్ కౌంటర్ పై ప్రజలు, సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గుల ఎన్ కౌంటర్ పై హీరోనాని స్పందించారు. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి..వాడు పోలీసోడై ఉండాలంటూ ట్వీట్ చేశారు.