గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.400కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అధికారులు తొలుత భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ కు చెందిన ఫిషింగ్ బోట్ అల్ హుసేనిని స్వాధీనం చేసుకున్నారు. అందులో సోదాలు నిర్వహించగా హెరాయిన్ బయటపడింది. బోట్ లో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ దాదాపు 400 కోట్ల రూపాయలు ఉంటుందని గుజరాత్ డిఫెన్స్ పీఆర్ ఓ ప్రకటించింది.
For More News