కమిలినీ ముఖర్జీ ఇలా అయిపోయిందేంటి?

కమిలినీ ముఖర్జీ ఇలా అయిపోయిందేంటి?

గోదావరి సినిమా పేరు చెబితే చాలు టక్కున కమిలిని ముఖర్జీనే గుర్తొస్తుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. ప్రతి ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఒకరుంటే చాలు అనేలా తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు కమలినీ ముఖర్జీకి సంబందించిన లెటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా కంట పడ్డాయి. ఆమె లుక్ చూసిన నెటిజెన్లు ఇదేంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

2004లో శేఖర్ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కిన ఆనంద్ సినిమాతో కమిలిని ముఖర్జీ టాలీవుడ్‭కు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కమిలినికి ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. గోదావరి, హ్యాపీడేస్, గమ్యం, జల్సా, గోపి గోపిక గోదావరి వంటి చిత్రల్లో ఆమె నటించారు. చివరిగా గోవిందుడు అందరివాడే సినిమాలో ఆమె కనిపించారు. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు గుర్తిండిపోయే పాత్రల్లో నటించారు. తన అందం, అభినయంతో కటిపడేశారు. సినిమాలకు దూరమైన కమిలినీ.. అమెరికాలో ఉంటూ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తాజాగా.. డల్లాస్‭లో జరిగిన ఓ ఈవెంట్‭లో ఆమె కనిపించింది. దీనికి సంబందించిన ఫోటోలు బయటికి రావడంతో కమిలిని ముఖర్జీ లుక్ చూసి నెటిజెన్లు షాక్ అయ్యారు. ఇలా మారిపోయింది ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.