హైదరాబాద్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమన్ ప్రీత్ సింగ్పై డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ కేసులో అతడిని ఏ–7గా చేర్చారు పోలీసులు. ఈ కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న అమన్ ప్రీత్ తన న్యాయవాది ద్వారా తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని అభ్యర్థించాడు.
ఈ పిటిషన్పై మంగళవారం (జనవరి 6) హైకోర్టులో విచారణ జరిగింది. అమన్ తరుఫున న్యాయవాది వాదనలు వినిపించారు. సహ నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా అమన్ను నిందితుడిగా ఎలా చేర్చుతారంటూ వాదించారు. మరోవైపు.. అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కన్స్యూమర్గా అని పోలీసులు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
