వరదల నివారణకు ఏం చేశారో చెప్పండి? : హైకోర్టు

వరదల నివారణకు ఏం చేశారో చెప్పండి? : హైకోర్టు
  • జీహెచ్‌ఎంసీ, హెచ్​ఎండీఏను ఆదేశించిన  హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : సిటీలో వరదల నివారణకు ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలని జీహెచ్‌ఎంసీని, సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. డ్రైనేజీల మురుగు నీరు పొంగి ప్రవహించడంతో జరిగిన ప్రమాదాల గురించి వివరిస్తూ అందిన లెటర్‌ను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. ‘జూబ్లీహిల్స్​లో వివేక్, కలాసిగూడ సమీపంలో మౌనిక అనే ఇద్దరు చిన్నారులు మరణించారు. 

కలాసిగూడలో డ్రైనేజీ వాటర్‌ను కట్టడి చేయలేని పరిస్థితుల్లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా విడుదల చేయడంతో మౌనిక మరణించింది. బోరుగుంతల్లో పడి చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనలపై ఆఫీసర్లు స్పందించేలా ఉత్తర్వులివ్వాలి’ అని లేఖలో పేర్కొన్నారు. దీనిని విచారించిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ల డివిజన్‌ బెంచ్‌.. 2 వారాల్లో వివరాలు అందజేయాలని సీఎస్, జీహెచ్​ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.