సహాయకుడి అంత్యక్రియల్లో హైకోర్టు జడ్జి

సహాయకుడి అంత్యక్రియల్లో హైకోర్టు జడ్జి

నిర్మల్, వెలుగు: హైకోర్టు జడ్జి జువ్వాడి శ్రీదేవి, కాంగ్రెస్ నిర్మల్ ​జిల్లా అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు దంపతుల నివాసంలో పని చేసే ఉదయ్ అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఉదయ్​ ఈస్వగ్రామం మామడ మండలం నల్దుర్తిలో బుధవారం నిర్వహించిన అంత్యక్రియలకు జడ్జి శ్రీదేవితోపాటు శ్రీహరిరావు హాజరయ్యారు. ఉదయ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులు లేని ఉదయ్ కొన్నేళ్లుగా తమ ఇంట్లో పని చేస్తూ కుటుంబసభ్యుడిగా ఉన్నాడని, రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మనస్తాపానికి గురిచేసిందన్నారు. జస్టిస్ శ్రీదేవి కంటనీరు పెడుతూ ఉదయ్ కుటుంబసభ్యులను ఓదార్చారు.