- ఇంకో 4 రోజులు మంటలే!
- భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీలు నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మరింత ముదురుతున్నాయి. బుధవారం కూడా రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీలు రికార్డయింది. ఇదే జిల్లా గరిమెళ్లపాడులో 45.4, మహబూబాబాద్జిల్లా బయ్యారం, ఖమ్మం జిల్లా ఖానాపూర్లో 45.4, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెం, నల్గొండ జిల్లా నిడమనూరులో 45.2, నల్గొండ జిల్లా దామరచర్ల, జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 44.9, లింగాలలో 44.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో అత్యధికంగా ఖైరతాబాద్లోని గణాంక భవన్ వద్ద 41.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. కాగా, మరో నాలుగు రోజుల పాటు ఎండలు ఇలాగే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు మినహా రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.