కాశీలో చితా భస్మంతో హోళీ

కాశీలో చితా భస్మంతో హోళీ

హిందువుల పుణ్యక్షేత్రం కాశీలో హోళీని వైవిధ్యంగా జరుపుకున్నారు భక్తులు. మణికర్ణికా ఘాట్ లో సాధువులు, అఘోరాలతో కలసి సామాన్య భక్తులు కూడా చితా భస్మం చల్లుకుంటూ హోళీ చేసుకున్నారు. అనేక మంది ఫారినర్లు కూడా చితా భస్మ హోళీలో పాల్గొన్నారు. కాష్టంలోని బూడిదను చల్లుకుంటూ చిందులేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం భోలేనాథ్ నామస్మరణంతో మారుమ్రోగింది.