మహబూబ్ నగర్ లో ఎస్పీ ఆఫీస్​కు భూమిపూజ

మహబూబ్ నగర్ లో ఎస్పీ ఆఫీస్​కు భూమిపూజ

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : జిల్లా కేంద్రంలోని పాత పోలీసు ఆఫీసు స్థానంలో రూ.39 కోట్ల తో ఎస్పీ ఆఫీస్​కు సోమవారం హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. పోలీసు, రెవెన్యూ శాఖలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్​ వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎస్పీ కె.నరసింహ, కలెక్టర్ జి.రవినాయక్, ఎఎస్పీ రాములు, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ , మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డీఎస్పీలు మహేశ్, మరణారెడ్డి, శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు.