అనారోగ్యంతో హోంగార్డ్ మృతి

అనారోగ్యంతో హోంగార్డ్ మృతి

కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్​లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అల్లూరి పోశం అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం చనిపోయాడు. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్  ఇంట్లో పోశం మృతదేహానికి కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, కాగజ్ నగర్ టౌన్ సీఐ బుద్దే స్వామి, రిజర్వ్ ఇన్​స్పెక్టర్(హోంగార్డ్స్) కిరణ్ కుమార్ నివాళులర్పించారు. అంతక్రియల కోసం రూ. 20 వేలు అందించారు.  కౌటల సీఐ సాదిక్ పాషా సొంతంగా రూ.10 వేలు సాయం చేశారు.