హ్యాట్సాఫ్ ఇండియా.. మన నేవీ మరో డేరింగ్ ఆపరేషన్

హ్యాట్సాఫ్ ఇండియా..  మన నేవీ మరో డేరింగ్ ఆపరేషన్

న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ మరో డేరింగ్ రెస్క్యూ ఆపరేషన్ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో వాణిజ్య నౌకపై హౌతీ రెబెల్స్ దాడి చేయగా, అందులోని 21 మంది సిబ్బందిని కాపాడింది. ఈ ఆపరేషన్ వీడియోను గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో ‘ట్రూ కాన్ఫిడెన్స్’ వాణిజ్య నౌకపై హౌతీలు బుధవారం మిసైల్ అటాక్ చేశారు. మంటలు అంటుకుని, నౌక కొంత దెబ్బతిన్నది. అందులోని సిబ్బందికి గాయాలయ్యాయి. ఐఎన్ఎస్ కోల్ కతా టీమ్ వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. నౌకలోని సిబ్బందిని హెలికాప్టర్, బోట్ల ద్వారా రక్షించింది. మొత్తం 21 మందిని కాపాడగా, వారిలో ఒక ఇండియన్ ఉన్నాడు.