కిచెన్ తెలంగాణ : సజ్జ మత్రీ

కిచెన్ తెలంగాణ : సజ్జ మత్రీ

సజ్జ మత్రీ

కావాల్సినవి :

సజ్జపిండి – మూడు కప్పులు

మిరియాల పొడి, వాము – ఒక్కో టీస్పూన్ చొప్పున

జీలకర్ర, పసుపు – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున

ఉప్పు – ఒకటింపావు టీ స్పూన్

కసూరీ మేథీ – ఒక టేబుల్ స్పూన్

వేరుశనగ నూనె – ముప్పావు కప్పు

నీళ్లు – ముప్పావు కప్పు

తయారీ : ఒక గిన్నెలో సజ్జ పిండి, వాము, జీలకర్ర, ఉప్పు, కసూరీ మేథీ, మిరియాల పొడి, పసుపు వేసి కలపాలి. అందులో వేరుశనగ నూనె పోసి మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని ముద్దగా కలపాలి. ఈ ముద్దను ఒక గిన్నెలో పెట్టి పైన క్లాత్​ కప్పి అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత చేతులకు నూనె రాసుకుని, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. వీటిని బిస్కెట్​లా వత్తి, ఫోర్క్​తో గుచ్చితే చిన్న రంధ్రాలు పడతాయి. నూనె వేడెక్కాక బిస్కెట్స్​లా చేసిన వాటిని అందులో వేగించాలి. కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు.