బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ ర్యాంకింగ్స్లో ప్రణయ్‌కు బెస్ట్ ర్యాంక్

బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ ర్యాంకింగ్స్లో  ప్రణయ్‌కు బెస్ట్ ర్యాంక్

న్యూఢిల్లీ: వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిసిన ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌ కెరీర్‌‌‌‌ బెస్ట్​ ర్యాంక్​ సాధించాడు. బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ మంగళవారం విడుదల చేసిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో మూడు స్థానాలు ఎగబాకిన ప్రణయ్‌‌‌‌ ఆరో ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. 

గతేడాది డిసెంబర్‌‌‌‌ నుంచి ఇండియా తరఫున ప్రణయ్‌‌‌‌ ఒక్కడే టాప్‌‌‌‌–10 ర్యాంక్‌‌‌‌లో కొనసాగుతుండటం విశేషం. . లక్ష్యసేన్‌‌‌‌ ఒక ర్యాంక్‌‌‌‌ కిందకు దిగజారి 12వ ప్లేస్‌‌‌‌లో ఉన్నాడు. కిడాంబి శ్రీకాంత్‌‌‌‌ 20వ ర్యాంక్‌‌‌‌లో కొనసాగుతున్నాడు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో పీవీ సింధు 14వ ర్యాంక్‌‌‌‌లో నిలిచింది. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి వరల్డ్‌‌‌‌ రెండో ర్యాంక్‌‌‌‌లోనే కొనసాగుతున్నారు. విమెన్స్‌‌‌‌ కేటగిరీలో ట్రిసా జాలీ– పుల్లెల గాయత్రి  రెండు ప్లేస్‌‌‌‌లు మెరుగై17వ ర్యాంక్‌‌‌‌కు చేరుకున్నారు.