హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్ నేషనల్బుక్ ఫేయిర్ఉంటుందని బుక్ ఫెయిర్ కమిటీ వెల్లడించింది. సోమవారం బుక్ ఫెయిర్ ఆఫీస్ లో అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో కమిటీ కొత్త సెక్రటరీగా ఆర్.వాసు బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ తేదీలను కార్యవర్గ సభ్యులు ఖరారు చేశారు. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ప్రతి ఏటా జరిగే ఎన్టీఆర్ స్టేడియంలోనే ఈసారి కూడా ఉంటుందని చెప్పారు.
పుస్తక ప్రియులు, పాఠకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో కోశాధికారి పి.రాజేశ్వరరావు, మాజీ కార్యదర్శి శృతికాంత్ భారతి, ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్, సహయ కార్యదర్శి శోభన్ బాబు, జనార్దన్ గుప్తా, కవి యాకూబ్, శ్రీకాంత్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.