ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష బిట్ బ్యాంకు

ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష  బిట్ బ్యాంకు
  • ముల్కీ ఉద్యమం ఆంధ్రా గోబ్యాక్​ ఇడ్లీ సాంబార్​ గో బ్యాక్​ నినాదాలతో ప్రారంభమైంది. 
  • విద్యార్థులు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి 1952 జులై 26న వరంగల్​ వేలాది మంది తో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించారు. 
  • సీఎం బూర్గుల రామకృష్ణారావు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో వరంగల్​లో విద్యార్థి ఐక్యకార్యాచరణ కమిటీ మరోసారి బ్రహ్మాండమైన ప్రదర్శన జరిపిన తేదీ 1952 ఆగస్టు 27.
  • హన్మకొండలో విద్యార్థులపై పోలీసులు 1952 ఆగస్టు 30వ తేదీన లాఠీఛార్జీ జరిపారు. 
  • హైదరాబాద్​లో విద్యార్థులు నాన్​ ముల్కీ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్​ గో బ్యాక్​ స్టూడెంట్​ యూనియన్​ జిందాబాద్​ నినాదాలతో 1952 సెప్టెంబర్​ 2న భారీ ర్యాలీ నిర్వహించారు. 
  • విద్యార్థులపై జరిపిన కాల్పులపై విచారణకు 1952 సెప్టెంబర్​ 5న ప్రభుత్వం జస్టిస్​ పింగళి జగన్మోహన్​రెడ్డి కమిటీ వేసింది. 
  • ముల్కీ నిబంధనలకు బూర్గుల ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని 1952 సెప్టెంబర్ 7న ఏర్పాటు చేసింది. 
  • ముల్కీ ఉద్యమంలో బారిష్ట కిషన్​కు సర్ నిజామత్​జంగ్​, బారిష్టర్​ అక్బర్​ అలీఖాన్​ సహకరించారు.
  • హైదరాబాద్​ హితరక్షణ సమితిని స్థాపించి 1952లో నాన్​ ముల్కీలకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం నడిపిన శాసనసభ్యుడు పి.రామాచారి. 
  • జగన్మోహన్​రెడ్డి కమిటీ నివేదికను 1952 డిసెంబర్​ 28న సమర్పించింది.
  • 1954 జూన్​, 7, 8వ తేదీల్లో హైదరాబాద్​ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్​లోని తెలంగాణ ప్రాంత సభ్యులు హైదరాబాద్​లో సమావేశమై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా       ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 
  • అప్పటి హైదరాబాద్​ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు స్వామి రామానందతీర్థ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విశాలాంధ్రను సమర్థించారు. 
  • విశాలాంధ్రను వ్యతిరేకిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని కాంగ్రెస్​ నాయకులు బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగరావు గట్టిగా సమర్థించారు. 
  • స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును 1948లో ఎస్​.కె.థార్​ కమిషన్​ను నియమించారు. 
  • భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 1949లో జేవీపీ కమిటీ ఏర్పాటు చేసింది. 
  • 1953లో రాష్ట్రాల ఏర్పాటుపై వాంఛూ కమిటీ వేసింది. 
  • 1953 అక్టోబర్​ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 
  • నూతన రాష్ట్రాల ఏర్పాటు, సమస్యల అధ్యయనం కోసం 1953 డిసెంబర్​ 22న రాష్ట్రాల పునర్విభజన కమిషన్​ ఏర్పాటు చేసింది.
  • రాష్ట్రాల పునర్విభజన కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ సయ్యద్​ ఫజల్​ అలీ. 
  • ఫజల్​ అలీ కమిషన్​ హైదరాబాద్​ను 1954 జూన్​, జులై సందర్శించింది. 
  •  విశాలాంధ్రను గట్టిగా వ్యతిరేకించి, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించాలనే వారికి కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించారు. 
  • 1955 సెప్టెంబర్​ 30న ఫజల్​ అలీ కమిషన్​ హైదరాబాద్​ను సందర్శించింది. 
  • ఏయే ప్రాంతాన్ని కలుపుతూ హైదరాబాద్​ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఫజల్​ అలీ కమిషన్​ బీదర్​ జిల్లాను మునగాల పరిగణా ప్రాంతాన్ని సిఫారసు చేసింది. 
  • 1961 జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత హైదరాబాద్​ రాష్ట్ర అసెంబ్లీలో 2/3వ వంతు సభ్యులు విలీనానికి ఒప్పుకుంటే ఆంధ్ర – తెలంగాణ ప్రాంతాలను కలిపి విశాలాంధ్రగా రూపొందించవచ్చని ఫజల్​ అలీ కమిషన్​ పేర్కొంది.
  • ఫజల్​ అలీ కమిషన్​ లేదా రాష్ట్రాల పునర్విభజన సంఘం వాదనలంతా విశాలాంధ్రను బలపరిచేదిగాను, డిక్రీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉందని తెన్నేటి విశ్వనాథం వ్యాఖ్యానించారు.
  • విశాలాంధ్ర వచ్చి ఏదో ఉద్ధరిస్తుందనే భ్రమతో తెలంగాణను వ్యతిరేకించడం భావ్యం కాదని 1955 అక్టోబర్​ 22న న్యూఢిల్లీలో కేవీ రంగారెడ్డి స్పష్టంగా చెప్పాడు. 
  • హైదరాబాద్​ దక్కన్​ చరిత్రలో అక్కన్న మాదన్నల తర్వాత ఒక రాజనీతిజ్ఞుడిగా, ముఖ్యమంత్రిగా, పరిపాలనాధ్యక్షుడిగా పేరు సాధించిన సీఎం బూర్గుల రామకృష్ణారావు. 
  • ఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేదీ 1956, ఫిబ్రవరి 20.
  • పెద్ద మనుషుల ఒప్పందానికి తెలంగాణ ప్రాంతం నుంచి హాజరైన నాయకులు  బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి,  మర్రి చెన్నారెడ్డి,  నరసింగరావు. 
  • పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 14 అంశాలపై రక్షణలు కల్పించారు. 
  • పెద్ద మనుషుల ఒప్పందంలో  ఉద్యోగాల్లో చేరడానికి అభ్యర్థులు ఆ ప్రాంతంలో 12 ఏండ్లు నివాసం ఉండి తీరాలని నిర్ణయించారు. 
  • పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ పరిపాలన, న్యాయ శాఖల్లో ఉర్దూ భాషకు ఉన్న స్థానాన్ని ఐదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించారు. 
  • పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయు భూముల అమ్మకం తెలంగాణ ప్రాంతీయ సంఘం ఆధీనంలో ఉండాలి. 
  • పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని రాజ్యాంగంలోని 371 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఏర్పరచాలి. 
  • పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 1962 వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్​ కమిటీ ఉంచాలని కోరుకున్నారు. 
  • పెద్ద మనుషుల ఒప్పందానికి ముల్కీ ఉద్యమం కారణభూతమైంది. 
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడక ముందు ఉత్తరాది నుంచి ముస్లింలు, కాయస్త బ్రాహ్మణులు వచ్చి హైదరాబాద్​ రాజ్యంలో ఉన్నతోద్యోగాలు సంపాదించుకొనేవారు. 
  • 1916లో ముల్కీ ఉద్యమాన్ని బారిష్టర్​ కిషన్​ ప్రారంభించారు.