హైదరాబాద్, వెలుగు : ఇండియా టేబుల్ టెన్నిస్ ప్లేయర్, హైదరాబాదీ సురావజ్జుల స్నేహిత్ రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్తో మెరిశాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్లో 3–2 (11–-2, 11–-8, 6–-11, 10–-12, 11–-8)తో ఇండియాకే చెందిన జీత్ చంద్రను ఓడించి సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. అయితే, సెమీ ఫైనల్లో స్నేహిత్ 0–3 (9-–11, 8–-11 6-–11)తో కిరిల్ షచ్కోవ్ (రష్యా) చేతిలో ఓడి బ్రాంజ్తో సరిపెట్టాడు.
