
లక్నో: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా కరోనా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిరోజూ తాను గోమూత్రం సేవిస్తానని, అందుకే తనకు ఇంతవరకు కరోనా రాలేదని ప్రగ్యా ఠాకూర్ అన్నారు. 'ప్రతి రోజూ గోమూత్రాన్ని తాగితే కరోనా వల్ల ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది. నాకు నొప్పిగా ఉన్నా గోమూత్రాన్ని సేవించడం మాత్రం ఆపలేదు. కరోనా రాకుండా ఉండేందుకు ఆవు మూత్రం తాగితే చాలు. వైరస్ అస్సలు దరిచేరదు' అని ప్రగ్యా పేర్కొన్నారు. కాగా, ఆవు మూత్రంతోపాటు ఇతర గోపదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల తాను క్యాన్సర్ నుంచి బయట పడ్డానని గతంలో ప్రగ్యా చెప్పారు.