నవంబర్17న ఐసీఎల్ ఎన్సీడీ ఇష్యూ

నవంబర్17న ఐసీఎల్ ఎన్సీడీ ఇష్యూ

న్యూఢిల్లీ: ఐసీఎల్​  ఫైనాన్స్,​ సెక్యూర్డ్​ నాన్​- కన్వర్టిబుల్ డిబెంచర్స్​ (ఎన్​సీడీ) పబ్లిక్​ ఇష్యూను ఈ నెల నవంబర్ 17 ప్రారంభించనుంది. ఈ ఇష్యూ నవంబర్ 28 వరకు ఉంటుంది. ఇది గరిష్టంగా 12.62 శాతం వరకు  రాబడిని అందిస్తుంది.  ఎన్​సీడీ ముఖ విలువ రూ.వెయ్యి  కాగా, కనీస పెట్టుబడి రూ. 10వేలు. ఈ ఇష్యూకు క్రిసిల్​  బీబీబీ-/స్టేబుల్ రేటింగ్​ ఉందని ఐసీఎల్​ ప్రకటించింది. 

13, 24, 36, 60 70 నెలల టెనార్లలో నెలవారీ, వార్షిక, సంచిత వడ్డీ ఆప్షన్లు ఉన్నాయి.  ఐసీఎల్​ ఫైనాన్స్​ గోల్డ్​ లోన్స్​, హైర్​ పర్చేజ్​ లోన్స్​, బిజినెస్​ లోన్స్​ అందిస్తుంది. ఈ పెట్టుబడులను సంస్థ వృద్ధికి ఉపయోగిస్తారమని సీఎండీ అనిల్​ కుమార్​ వివరించారు.