- వెహికల్ అమ్మిన తర్వాత ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకోవట్లే
- ఏజెంట్లు అమ్మితే సెకండ్ఓనర్లు పట్టించుకోవట్లే
- అమ్మిన బండి ఓనర్లకు ట్రాఫిక్ చలాన్ల ఇబ్బందులు
“ కూకట్పల్లికి చెందిన ఐటీ ఎంప్లాయ్ రాజారాం ఐదేండ్ల కిందట ఏజెంట్ద్వారా బైక్ అమ్మిండు. ఆ బైక్ను ఏజెంట్ఎవరికి అమ్మిండో తెలియదు. ఆర్సీ ట్రాన్స్ఫర్చేయాలని రాజారాం ఎంత చెప్పినా ఏజెంట్పట్టించుకోలేదు. దీంతో ఆ బండి కొన్న వ్యక్తికి రావాల్సిన చలాన్లు రాజారాం పేరుపైనే వస్తున్నాయని ఆందోళన చెందుతుండు.’’
హైదరాబాద్, వెలుగు: సిటీలో సెకండ్హ్యాండ్ వెహికల్స్ అమ్మకాల్లో ఏజెంట్ల మోసంతో ఓనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం కాంతారెడ్డి, రాజారాంల పరిస్థితే కాదని, బైక్అమ్మిన ఓనర్లందరి పరిస్థితి ఇట్లనే ఉంది. ఏజెంట్ల ద్వారా వెహికల్ కొన్నవాళ్లు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్బ్రేక్చేసినా ఆ చలాన్లన్నీ ఆర్సీ ఓనర్పేరు మీదనే వెళ్తున్నాయి. బైక్, కార్లను సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేసేందుకు థర్డ్ పార్టీ ఏజెంట్లు యాక్టీవ్ ఉంటున్నారు. ప్రభుత్వ పర్మిషన్లు పొందిన ఏజెన్సీలు కాకుండా ఫైనాన్సియర్లు కూడా ఏజెంట్లతో కలిసి బైక్లను కొంటున్నారు. బైక్ షోరూమ్స్ వద్ద ఉంటుండగా దగ్గరికి వచ్చిన వారికి వెహికల్ కండీషన్ను బట్టి రేట్ ఫిక్స్ చేసి కొంటారు. ఈ క్రమంలోనే వెహికల్ పై ఉన్న ట్రాఫిక్ ఫైన్లను కూడా వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో వెహికల్పై చాలాన్ల పేరిట సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు కమీషన్ తీసుకుంటున్నారు.
రూల్స్ బ్రేక్ చేస్తుండగా..
సెకండ్ హ్యాండ్లో బండి కొంటే, ఆర్టీఐ రూల్స్ప్రకారం వెంటనే ఆర్సీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కానీ అలా చేయకుండా ఏజెంట్లు వేరే వాళ్లకు అమ్మేస్తున్నారు. బైక్ తమ పేరు మీద లేకపోవడంతో సెకండ్ హ్యాండ్బండ్లను వాడుతున్న చాలామంది ట్రాఫిక్ రూల్స్బ్రేక్ చేయడానికి వెనుకాడటం లేదు. సీసీ కెమెరాలు, పోలీసులు ఫొటోలు తీస్తున్నా లైట్ తీసుకుంటున్నారు. దీంతో అసలైన ఓనర్లకు ట్రాఫిక్ చలాన్లు చిక్కులు వచ్చి పడుతున్నాయి.
కంప్లయింట్ చేయొచ్చు
ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు ట్రాఫిక్ పోలీసులకు కంప్లయింట్ చేయొచ్చు. ఈ చలాన్ సైట్లోకి వెళ్లి, ‘complaint’ అనే ఆప్షన్ క్లిక్ చేసి బైక్ వివరాలు, మెయిల్, కాంటాక్ట్ నంబర్ డీటెయిల్స్తో సబ్మిట్ చేయాలి. కంప్లయింట్లో ఉన్న బైక్ వివరాలను హాట్ లిస్ట్లో పెట్టి టీఎస్ పోలీస్ కాప్ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ వెహికల్స్చెకింగ్లో పట్టుబడే వాటిని సీజ్ చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత కంప్లయింట్చేసిన బండి ఓనర్కి సమాచారం అందిస్తారు. ఇలాంటి కంప్లయింట్లు ఇప్పటివరకు సిటీలో 482 ఉన్నట్టు పోలీసులు తెలిపారు.