
బ్రిటన్: టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. నాలుగో టెస్ట్ జరుగుతోన్న మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో 51 సంవత్సరాల తర్వాత హాఫ్ సెంచరీ చేసిన భారత ఓపెనర్గా నిలిచాడు. చివరగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో 1959లో భారత ఓపెనర్ నారి కాంట్రాక్టర్ హాఫ్ సెంచరీ సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరే ఇతర భారత ఓపెనర్ కూడా ఓల్డ్ ట్రాఫోర్డ్లో హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు.
51 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరుగుతోన్న నాలుగో టెస్టులో అర్ధసెంచరీ బాది.. నారి కాంట్రాక్టర్ 51 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టాడు జైశ్వాల్. ఇదే కాకుండా ఈ మ్యాచులో మరో రికార్డ్ కూడా సాధించాడు జైశ్వాల్. ఇంగ్లాండ్లో 1000 టెస్ట్ రన్స్ కంప్లీట్ చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగవ భారత ఓపెనర్గా.. ఓవరాల్గా 20వ ఇండియన్ బ్యాటర్గా అరుదైన ఫీట్ నెలకొల్పాడు.
►ALSO READ | IND vs ENG 2025: తడబడిన టీమిండియా.. రెండో సెషన్లో ఇంగ్లాండ్కు మూడు వికెట్లు
ఈ మ్యాచులో జైశ్వాల్ 58 పరుగులు చేసి డాసన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. మరో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ తృటిలో ఈ రికార్డ్ మిస్ చేసుకున్నాడు. నాలుగో టెస్టులో యశస్వీ జైశ్వాల్తో కలిసి ఇన్సింగ్స్ ఆరంభించిన కేఎల్ రాహుల్ 46 పరుగులు వద్ద ఔట్ అయ్యాడు. దీంతో 4 పరుగుల దూరంలో ఈ రికార్డ్ మిస్ అయ్యింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్ ఫస్ట్ సెషన్లో ఆకట్టుకున్న టీమిండియా రెండో సెషన్లో తడబడింది. తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోని భారత్ రెండో సెషన్లో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. జైశ్వాల్ 58, రాహుల్ 46, కెప్టెన్ శుభమన్ గిల్ 12 పరుగులు చేసి ఔట్ అయ్యారు. తొలి రోజు టీ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజ్లో సాయి సుదర్శన్ (26), పంత్ (3) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, స్టోక్స్, డాసన్ తలో వికెట్ తీసుకున్నారు.