కాకినాడలో ఐఐఎఫ్‭టీ క్యాంపస్‌ను ప్రారంభించిన నిర్మలా సీతారామన్

కాకినాడలో ఐఐఎఫ్‭టీ క్యాంపస్‌ను ప్రారంభించిన నిర్మలా సీతారామన్

కాకినాడలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ పర్యటిస్తున్నారు. జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, వంగా గీతా పాల్గొన్నారు. ప్రస్తుతం జేఎన్‌టీయూలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియా లో తొలి ఐఐఎఫ్‌టీ క్యాంపస్‌ ను కాకినాడలో ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు పాల్గొన్నారు. నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ రాకతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.