గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికి నేను రెడీ

గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికి నేను రెడీ

ధనుష్ సరసన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ సురభి. బీరువా, ఎక్స్‌ప్రెస్‌రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌ఒక్కక్షణం, ఓటర్‌ సినిమాల‌తో మెప్పించిన ఆమె..ప్ర‌స్తుతం ఆది సాయికుమార్ హీరోగా నందికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం శశితో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించి సురభి మాట్లాడుతూ...ఈ మూవీ రెగ్యుల‌ర్ ల‌వ్‌స్టోరీ కాదని.. ఎమోష‌న్స్‌, ఇంటెన్సిటీతో కూడిన ర‌గ్‌డ్ ల‌వ్‌స్టొరీ అని చెప్పింది. ఈ సినిమాలో న‌ట‌న‌కు మంచి స్కోప్  ఉన్న పాత్ర  తనదని.. ఆడియ‌న్స్‌కి తప్ప‌కుండా నచ్చుతుందని తెలిపింది.  

ఈ మూవీలో నాది ఒక డామినేటింగ్ ప‌ర్స‌నాలిటీ. నా క్యారెక్ట‌ర్లో మ‌రో షేడ్ ఉంటుంది. అదేంట‌న్న‌ది మాత్రం సినిమాలోనే చూడాలి. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. నాతోపాటు ఈ సినిమాలో ప్ర‌తి పాత్ర‌కు ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు తెలుగులో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో డెబ్యూ మూవీ స‌క‌త్ చేస్తున్నాను. తెలుగులో రెండు స్క్రిప్ట్స్ విన్నాను. త్వ‌ర‌లోనే వాటి గురించి వివ‌రిస్తాను. గ్లామ‌ర‌స్ రోల్స్ చేయ‌డానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటాను. ఇండ‌స్ట్రీలోని గ్రేట్ పీపుల్స్ అంద‌రితో వ‌ర్క్ చేయాల‌ని కోరుకుంటు న్నాను. అలాగే మైథాలాజిక‌ల్ మూవీస్ లో న‌టించ‌డం ఇష్టం. వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తానుఅని సురభి వివరించింది.