
- రష్యా దాడితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థకు ఊరట
ఫ్రాంక్ ఫర్ట్ : రష్యా దండయాత్రతో అతలాకుతలమైన ఉక్రెయిన్కు రూ.1.28 లక్షల కోట్ల (15.6 బిలియన్డాలర్లు) రుణం ఇచ్చేందుకు ఇంటర్నేషన్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) పచ్చజెండా ఊపింది. దీనిపై ఇరుపక్షాలు ఓ అగ్రిమెంట్ను కుదుర్చుకున్నాయి. ఈ లోన్ ద్వారా సమకూరే నిధులను ఉక్రెయిన్ ప్రభుత్వ అవసరాలను తీర్చడానికి వినియోగించనున్నారు. ఈ రుణాన్నినాలుగేళ్లలో విడతల వారీగా ఉక్రెయిన్కు ఐఎంఎఫ్ అందిస్తుంది. లోన్ మంజూరయ్యాక.. మొదటి 12 నుంచి 18 నెలల్లోగా దేశ బడ్జెట్లోటును పూడ్చుకోవడంపై ఉక్రెయిన్ ఫోకస్ చేస్తుంది. ‘‘సెంట్రల్ బ్యాంక్ ద్వారా కరెన్సీని ముద్రించుకొని దేశ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం మొదలుపెడితే ఉక్రెయిన్ కరెన్సీ విలువ పతనమయ్యే ముప్పు ఉంటుంది.
ఇలా జరగకుండా.. మేం అందించే లోన్ హెల్ప్ చేస్తుంది”అని ఐఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. జీ7 దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి రానున్న రోజుల్లో ఉక్రెయిన్కు ఆర్థిక సహాయక ప్యాకేజీలు అందుతాయనే సానుకూల దృక్పథంతో ఈ లోన్ను మం జూరు చేసినట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది. రష్యాను ఎదుర్కొనేందుకు గతేడాది సైనిక వ్యయాలను ఉక్రెయిన్ భారీగా
పెంచింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా దాదాపు 30 శాతం పడిపోయింది. సంక్షోభ పరి స్థితుల కారణంగా ఉక్రెయిన్ఖజానాకు పన్నుల రూపంలో ప్రజల నుంచి సమకూరే ఆదాయాలు కూడా డౌన్ అయ్యాయి.