
అమెరికా అధ్యక్ష పదవిని రెండో సారి చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అవుతూ వస్తు్న్నాయి. కొన్నిసార్లు సంచలనం కోసం తీసుకున్న నిర్ణయాలుగా.. మరి కొన్ని సార్లు ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలుగా పలుమార్లు విమర్షలకు గురయ్యాయి. ఎక్జిక్యూటివ్ ఆర్డర్స్ పేరున పరిపాలనతో ఎన్నో అంశాలలో మార్పులు చేస్తున్నట్లు ఆర్డర్స్ పాస్ చేశారు. సిటిజన్షిప్ హక్కు, ఉద్యోగుల తొలగింపు, భద్రత, దౌత్య పరమైన విషయాలు.. ఇలా ఎన్నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకోగా అందులో కొన్ని వివాదాస్పదం అయ్యాయి. ఫెడరల్ కోర్టులు ఆ ఆర్డర్స్ ను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి.
ఇష్టారీతిన తను అనుకున్న నిర్ణయం తీసుకునే క్రమంలో ఫెడరల్ కోర్టులు ఎప్పటికప్పుడు అడ్డు చెబుతూ.. బ్లాక్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఫెడరల్ కోర్టుల జోక్యంపై సుప్రీం కోర్టులో ట్రంప్ కు భారీ విజయం దక్కింది. ట్రంప్ ఇచ్చే ఎక్జిక్యూటివ్ ఆర్డర్స్ ను బ్లాక్ చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసులో 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
Also Read : దర్యాప్తులో మీ సాయం అవసరం లేదు
బర్త్ రైట్ సిటిజన్షిప్ (పుట్టుకతోనే అమెరికా పౌరుడిగా హక్కు) ను రద్దు చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆర్డర్ కు మద్ధతుగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ ఇచ్చే అంశంలో వెంటనే సుప్రీంకోర్టు తీర్పు అమలులోకి రాదు. సిటిజన్షిప్ విషయంలో నిర్ణయానికి మున్ముందు అడ్డంకి తొలగినట్లుగా భావించవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విషయంలో వైట్ హౌజ్ అధికారాలను బలపరుస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ తీర్పుతో ముగ్గురు జడ్జిలు విభేదించారు.
ప్రసిడెంట్ ఇచ్చే ఆర్డర్స్ దేశవ్యాప్తంగా అమలు అయ్యే సందర్భంలో.. ఒక జిల్లా లేదా స్టేట్ కు చెందిన ఫెడరల్ జడ్జి దేశ వ్యాప్తంగా వర్తించే ఆర్డర్స్ ను ఎలా అడ్డుకోగలరు అని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
సిటిజన్షిప్ పై ట్రంప్ ఆర్డర్స్ ను మేరీలాండ్, మస్సాచుసెట్స్, వాషింగ్టన్ రాష్ట్రాల ఫెడరల్ జడ్జిలు రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణిస్తూ బ్లాక్ చేయడం తెలిసిన విషయమే. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన ట్రంప్ కు సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చింది. సిటిజన్షిప్ విషయంలో ట్రంప్ మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే అమెరికాలో సెటిల్ అయిన చాలా మంది పిల్లలకు సంక్రమించే హక్కు రిస్కులో పడినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.