కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం:  పూజల హరికృష్ణ

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం:  పూజల హరికృష్ణ

సిద్దిపేట రూరల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇర్కోడు, తోర్నాల, రాంపూర్, అర్బన్ మండల పరిధిలోని ఎన్సాన్ పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని కేటాయిస్తామన్నారు.

జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామితో మాట్లాడి మొదటి విడతలో రానివారికి రెండో విడతలో న్యాయం చేస్తామన్నారు. అనంతరం పట్టణంలోని క్యాంప్ ఆఫీస్ లో 100 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంజిరెడ్డి, మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, నరహరి, దేవయ్య, మల్లయ్య, శ్వేత, యాదగిరి, ఎల్లయ్య, కిష్టారెడ్డి, లావణ్య, స్వప్న పాల్గొన్నారు.