
న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ 20-–18తో రోహ్తక్ రౌడీస్ పై ఉత్కంఠ విజయం సాధించింది. అండర్ కార్డ్కేటగిరీ మెన్స్లో జగదీశ్ (100 కేజీ), అస్కర్ అలీ (80 కేజీ) నెగ్గగా, విమెన్స్ 65 కేజీల్లో కేఎన్ మధుర, జిన్సీ జోస్ ఓడిపోవడంతో ఇరు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి.
మెయిన్ కార్డ్ ప్లస్ 100 కేజీ కేటగిరీలో ఉజ్వల్0–10తో సంజయ్ చేతిలో ఓడగా.. 70 కేజీల్లో స్టీవ్ థామస్ 10–0తో మోహిత్పై, స్పెషల్ కేటగిరీలో బుట్టా సింగ్ 5–0తో శ్రీనివాస్పై నెగ్గారు. కానీ, చివరిదైన 90 కేజీల్లో అర్ష్దీప్ 0–5తో సిద్దార్థ్ చేతిలో ఓడటంతో ఇరు జట్లూ17–17తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను తేల్చేందుకు టై బ్రేక్ను నిర్వహించారు. ఇందులో మధుర, స్టీవ్ థామస్, అస్కర్ అలీ తమ మ్యాచ్ల్లో నెగ్గడంతో హైదరాబాద్ ఫైనల్ చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో కొచ్చితో హైదరాబాద్ పోటీ పడనుంది.