ప్రొ పంజా లీగ్ ఫైనల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌

ప్రొ పంజా లీగ్ ఫైనల్లో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్‌‌‌‌‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌) తొలి సీజన్‌‌‌‌‌‌‌‌లో కిరాక్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌  జట్టు  ఫైనల్‌‌‌‌‌‌‌‌కు  దూసుకెళ్లింది. శనివారం జరిగిన  సెమీఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 20-–18తో రోహ్​తక్​ రౌడీస్​ పై ఉత్కంఠ విజయం సాధించింది. అండర్​ కార్డ్​కేటగిరీ మెన్స్‌‌‌‌‌‌‌‌లో జగదీశ్‌‌‌‌‌‌‌‌ (100 కేజీ), అస్కర్‌‌‌‌‌‌‌‌ అలీ (80 కేజీ) నెగ్గగా, విమెన్స్‌‌‌‌‌‌‌‌ 65 కేజీల్లో కేఎన్‌‌‌‌‌‌‌‌  మధుర, జిన్సీ జోస్‌‌‌‌‌‌‌‌ ఓడిపోవడంతో ఇరు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి.  
మెయిన్​ కార్డ్​ ప్లస్​ 100 కేజీ కేటగిరీలో ఉజ్వల్​0–10తో  సంజయ్​ చేతిలో ఓడగా.. 70 కేజీల్లో స్టీవ్‌‌‌‌‌‌‌‌​ థామస్​ 10–0తో మోహిత్‌‌‌‌‌‌‌‌పై, స్పెషల్​ కేటగిరీలో బుట్టా సింగ్​ 5–0తో శ్రీనివాస్​పై నెగ్గారు.  కానీ, చివరిదైన 90 కేజీల్లో అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ 0–5తో సిద్దార్థ్​ చేతిలో ఓడటంతో ఇరు జట్లూ17–17తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను తేల్చేందుకు టై బ్రేక్​ను నిర్వహించారు. ఇందులో ​ మధుర,  స్టీవ్​ థామస్, అస్కర్​ అలీ తమ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో నెగ్గడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో కొచ్చితో హైదరాబాద్​ పోటీ పడనుంది.