బీజేపీ నాలుగో జాబితాలో ముగ్గురికి చోటు

బీజేపీ నాలుగో జాబితాలో ముగ్గురికి చోటు
  •     మునుగోడు నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి ఖరారు
  •     కోదాడ టికెట్​జనసేనకు కేటాయింపు

నల్గొండ, వెలుగు : బీజేపీ నాలుగో జాబితాలో నల్గొండ జిల్లాలో ముగ్గురికి చోటు దక్కింది. మునుగోడు నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్​ నుంచి నకిరేకంటి మొ గులయ్య (ఎస్వీ రిజర్వుడ్), మిర్యాలగూడ నుంచి సాధినేని శ్రీనివాస్ రావు పేర్లను హైకమాండ్​ ఖరారు చేసింది. మునుగోడు కాంగ్రెస్​ టికెట్​ఆశించిన కృష్ణారెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.  మునుగోడు అభ్యర్థిగా ఆయననే కన్ఫాం చేసింది. కమ్మసామాజిక వర్గానికి మిర్యాలగూడ సీటు కేటాయిచింది.

సాధినేని శ్రీనివాస్​రావు ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. నకిరేకంటి మొగలయ్య రామన్నపేట మాజీ సర్పంచ్. మొత్తం 12 స్థానాలకు గాను పొత్తులో భాగంగా కోదాడ జనసేనాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ మేకల సతీశ్ రెడ్డి ప్రకటించారు. దీంతో జిల్లాలో బీజేపీ అభ్యర్థులు ఎంపిక పూర్తయినట్టే.