వృద్ధులను నమ్మించి.. నగదు కొట్టేశారు

వృద్ధులను నమ్మించి.. నగదు కొట్టేశారు

జన్నారం, వెలుగు : ఇద్దరు వృద్ధులను నమ్మించి రూ.18 వేలు కాజేసిన ఘటన జన్నారం మండలంలోని తిమ్మాపూర్ లో జరిగింది.  గ్రామానికి చెందిన సామల బుచ్చయ్య, రాజవ్వ ఇంటికి ఆదివారం ఇద్దరు దుండగులు నెంబర్ ప్లేట్ లేని బైక్​పై వచ్చారు. వారి ఇంటి పక్కనే కొత్తగా ఇళ్లు కట్టుకుంటున్న రాజేందర్​కు ఇటుక వేశామని, ఆయన  రూ.20 వేలు ఇమ్మనాడని నమ్మ బలికారు.  

రూ.2 లక్షలు డ్రా చేయడానికి రాజేందర్ బ్యాంక్​కు వెళ్లాడని.. వచ్చాక మీ డబ్బులు ఇస్తాడని చెప్పారు. రాజేందర్ మాదిరిగా ఎవరితోనో ఫోన్​లో మాట్లాడించారు. ఇదంతా నమ్మిన వృద్ధులు  వారికి రూ.18 వేలు ఇచ్చి పంపారు. ఆ తర్వాత రాజేందర్​ను సంప్రదించగా, వారేవరో తనకు తెలియదని అసలు బ్యాంక్ కే వెళ్లలేదని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.