
ముంబై: ఈ వారం మార్కెట్ డైరెక్షన్ను ఎకనామిక్ డేటా, గ్లోబల్ ట్రెండ్స్, ఎఫ్ఐఐల కదలికలు నిర్ణయిస్తాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ కిందటి వారం కాస్త డల్గా ముగిశాయి. “గ్లోబల్, డొమెస్టిక్ అంశాల వలన కిందటి వారం మార్కెట్ వోలటాలిటీలో కదిలింది.
గ్లోబల్గా చూస్తే, యూఎస్ బాండ్ యీల్డ్స్ పెరగడం, అమెరికా అప్పులపై ఆందోళనల వలన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఇండియన్ మార్కెట్లో అమ్మకాలు జరిపారు. ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్పై ఒత్తిడి పెరిగింది” అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి ఇండియా ఇండస్ట్రియల్, మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్షన్ డేటా (మే 28న), క్యూ1 జీడీపీ గ్రోత్ నెంబర్లు వెలువడనున్నాయి. వర్షకాల పరిస్థితులను కూడా ట్రేడర్లు జాగ్రత్తగా గమనించనున్నారు.
గ్లోబల్గా, యూఎస్ బాండ్ మార్కెట్ డెవలప్మెంట్స్, ఫెడ్ మినిట్స్ రిలీజ్, ఇండియా,- యూఎస్ ట్రేడ్ చర్చలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేయనున్నాయి. వీటితో పాటు ఈ వారం మే డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ ఉంది. బజాజ్ ఆటో, అరోబిందో ఫార్మా, ఐఆర్సీటీసీ లాంటి పెద్ద కంపెనీల రిజల్ట్స్ వెలువడనున్నాయి. వీటికితోడు ఆర్బీఐ ఇచ్చే రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్తో ప్రభుత్వ ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతుందని అంచనా. ఇది మార్కెట్కు సానుకూల అంశం. గత వారం సెన్సెక్స్ 609.51 పాయింట్స్ (0.74శాతం), నిఫ్టీ 166.65 పాయింట్స్ (0.66శాతం) పడ్డాయి.